జెండా కట్టకుండా అడ్డు: జగన్ పార్టీ నేతపై కేసు నమోదు

భూమా నాగి రెడ్డి, ఆయన అనుచరులపై టిడిపి కార్యకర్త తిరుపతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డలో పర్యటించిన సమయంలో తమ పార్టీ జెండాలు కట్టనీయకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అడ్డుకుంటోందని టిడిపి విమర్సలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంగళవారం కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.
అధికారుల వైఖరిని నిరసిస్తూ స్థానిక పోలీసు స్టేషన్ను ముట్టడించారు. బ్యానర్లు తొలగించబోమని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో టిడిపి కార్యకర్తలు తమ ఆందోళనను విరమించారు.
కాగా ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం జిల్లాకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్థానిక నేతలు, రాయచోటి ప్రాంత నేతలతో సమావేశమయ్యారు. విబేధాలు పక్కన బెట్టి పార్టీ విజయానికి కృషి చే యాలని నేతలకు బాబు సూచించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు అనంతలో మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులు మరణిస్తే తక్షణం ఆదుకునేలా ఆపద్భంధు పథకం తమ హయాంలో ప్రారంభించిన విషయాన్ని బాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసంఘటిత రంగ కార్మికులను కాంగ్రెసు నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications