మహాత్ముడిని జాతిపితగా ప్రకటించలేదు: కేంద్రం వెల్లడి

సమాచార హక్కు చట్టం కింద అభిషేక్ కడ్యన్ అనే సామాజిక కార్యకర్త అడిగిన ప్రశ్నకు డైరెక్టర్ అండ్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సిపిఐవొ) శ్యామలా మోహన్ జూన్ 18న ఇచ్చిన సమాధానంలో ఈ విధంగా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతిపితగా బహుళ ప్రాచుర్యం పొందినప్పటికీ.. ప్రభుత్వపరంగా అలాంటి బిరుదు ఏదీ ఆయనకు అధికారికంగా ఎప్పుడూ ప్రదానం చేయలేదని వివరించారు. అభిషేక్ మే 21వ తేదిన జాతిపితకు సంబంధించిన వివరాలు కావాలని అడిగారు.
అంతకుముందు.. లక్నోకు చెందిన ఐశ్వర్య పరాశర్ అనే ఆరోతరగతి విద్యార్థిని బాపూజీకి జాతిపిత బిరుదు తాలూకూ ఆర్డర్ ఫొటో కాపీ కావాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోగా.. తమ వద్ద అలాంటి పత్రమేదీ లేదని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఐశ్వర్యకు సమాధానం పంపింది.
ఐశ్వర్య జాతిపిత వివరాలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని కోరినప్పుడు అందుకు సంబంధించిన పత్రాలు తమ వద్ద లేవని చెబుతూ వారు ఆర్చీవ్స్ ఆఫ్ ఇండియాకు పంపారు. అక్కడ కూడా ఆ పత్రం లభించలేదు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications