ధిక్కరించిన ఐదుగురు ఎమ్మెల్యేలు, బాబుకు కష్టమే

ఓటు వేసిన ఐదుగురు శాసనసభ్యుల్లో చిన్నం రామకోటయ్య, కొడాలి నాని, బాల నాగిరెడ్డి ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. హరీశ్వర్ రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి మాత్రం తెలంగాణ నగారా సమితి శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డితో కలిసి పిఎ సంగ్మాకు ఓటేశారు. చిన్నం రామకోటయ్య గత కొద్ది కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన తొలుత జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడ తన షరతులకు ఆమోదం లభించకపోవడంతో కాంగ్రెసు పార్టీకి దగ్గరయ్యారు. ఆయన ఓటు వేయడానికి కూడా కాంగ్రెసు శాసనసభ్యులతో కలిసి వచ్చారు.
ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, అధ్యక్షుడు వైయస్ జగన్ను కలిసినందుకు గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. చిన్నం రామకోటయ్యపై కూడా చర్యలు తీసుకోవడానికి సిద్దపడుతోంది. కొడాలి నాని నియోజకవర్గం గుడివాడకు, చిన్నం రామకోటయ్య నియోజకవర్గం నూజివీడుకు తెలుగుదేశం పార్టీ ఇంచార్జీలను కూడా నియమించింది. బాలనాగిరెడ్డి మాత్రం చాలా కాలంగా వైయస్ జగన్ వెంట నడుస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది.
ఇక, తెలంగాణపై చంద్రబాబు వైఖరిని హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి వ్యతిరేకిస్తూ నాగం జనార్దన్ రెడ్డితో కలిసి నడుస్తున్నారు. వీరిపై పార్టీ ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలకు కూడా పూనుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే, చంద్రబాబుకు గడ్డు కాలం ఎదురైనట్లే ఉంది.
పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ఎంతగా గాడిలో పెట్టాలని ప్రయత్నించినా ఫలితం ఉండడం లేదు. ఎప్పటికప్పుడు పార్టీలో అసమ్మతి చెలరేగుతూనే ఉన్నది. మరోవైపు, నందమూరి, నారా వారి కుటుంబాల మధ్య వారసత్వ పోరు కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే ఉందని అంటున్నారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications