బీహారీలు: అదే దారిలో ఉద్దవ్: రాజ్కి నటి రవీనా సపోర్ట్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విద్రోహులను వెనకేసుకొస్తే ఎన్డీయే తరపున ప్రధానిగా ఆయన అభ్యర్థిత్వాన్ని అంగీకరించబోమని ఉద్ధవ్ అన్నట్లు శివసేన పత్రిక 'సామ్నా' వెల్లడించింది. అమర్ జవాన్ స్మారకస్తూపాన్ని అవమానపరిచిన వ్యక్తి బీహార్ వాసుడైనందుకు నితీష్ సిగ్గుపడాలని కూడా పేర్కొంది. ఆజాద్ మైదాన్ హింసాత్మక ఘటనలకు పాల్పడి బీహార్కు పారిపోయి వచ్చిన వారికి నితీష్ మద్దతు తెలిపి వివాదాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.
కాగా గత వారం మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బీహారీలను అక్రమ వలసదారులుగా పేర్కొన్న విషయం తెలిసిందే. వారికి పర్మిట్లు ఉండాలని డిమాండ్ చేశారు. తాజాగా ఉద్దవ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. మరోవైపు బీహారీలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను రాజ్ ఠాక్రే పైన పోలీసులు కేసు నమోదయింది. బీహార్లోని నలంద జిల్లా కోర్టులో ఈ కేసు సోమవారం నమోదైంది.
కాగా పాకిస్తాన్ కళాకారులకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ నుండి మద్దతు లభించింది. ఆయన వ్యాఖ్యలకు ఇదివరకు ఇతర రంగాల నుండి మాత్రమే మద్దతు వచ్చేది. కానీ తాజాగా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూడా రాజ్ వ్యాఖ్యలను సమర్థించారు. రాజ్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, ఓ టీవీ ఛానల్లో ప్రసారం కానున్న సూరక్షేత్ర కార్యక్రమంలో పాక్ కళాకారులు పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ రాజ్ చేసిన వ్యాఖ్యలు సమర్థనీయమే అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications