హర్షారెడ్డి కిడ్నాపర్ల అరెస్ట్: డబ్బుకోసమే, నెలక్రితం ప్లాన్

కారు డ్రైవర్ సూదిరెడ్డి మురళీ కృష్ణా రెడ్డి, ట్రాక్టర్ డ్రైవర్ రాజులు పరారీలో ఉన్నారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు మండల డిసిపి గంగాధర్ వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా నున్న గ్రామానికి చెందిన డాక్టర్ హర్షా రెడ్డి మలక్పేట యశోదా ఆస్పత్రిలో డిఎన్ఏ రెడియాలజిస్ట్గా పని చేస్తున్నాడు. హర్షా రెడ్డి పెదనాన్న కుమారుని బావమరిది శ్రీనివాస్ రెడ్డి తన తండ్రి అనారోగ్యానికి గురవడంతో సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చేర్చాడు.
ఆ సమయంలోనే హర్షా రెడ్డి తనకు బంధువని తెలుసుకున్నారు. దురలవాట్లతో అప్పుల పాలైన శ్రీనివాస్ రెడ్డి కోటీశ్వరైడనహర్షా రెడ్డిని కిడ్నాప్ చేసి రూ.50 లక్షలు రాబట్టుకోవాలని నెలన్నర క్రితమే పథకం రూపొందించుకున్నాడు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ హర్షా రెడ్డిని ఆస్పత్రి నుంచి తీసుకెళ్లి బయట ఉన్న కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే కారు వెనుక సీటులో శివయ్య, సూదిరెడ్డి మురళీ కృష్ణారెడ్డి, వల్లరాజు ఉన్నారు.
కారు వనస్థలిపురం వరకు వెళ్లగానే ముందు సీట్లో కూర్చున్న హర్షా రెడ్డి గొంతుకు వైర్ బిగించి చేతులు కట్టేసి డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ పథకాన్ని తెలివిగా మార్చారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కోటి రూపాయలు బాకీ ఉన్నాడని, అందులో రూ. 50 లక్షలు ఇస్తే వదిలేస్తామని, లేదంటే శ్రీనివాస్ రెడ్డితోపాటు నిన్ను కూడా చంపుతామని బెదిరించారు. హర్షా రెడ్డి సెల్ తమతో ఉంటే ఇబ్బందని గ్రహించి దుర్గా రెడ్డిని పిలిపించి ఫోన్ ఇచ్చారు.
అదేరోజు రాత్రి హర్షా రెడ్డిని నూజివీడు తీసుకెళ్లి షెడ్డులో బంధించారు. మరుసటి రోజు దుర్గా రెడ్డికి ఫోన్ చేసి విజయవాడకు రమ్మన్నారు. ఆయన వస్తున్న కారు సూర్యాపేట వద్ద మొరాయించింది. ఈ విషయాన్ని విజయవాడలో ఉన్న తన సోదరుడైన మురళి, కృష్ణారెడ్డిలకు ఫోన్చేసి చెప్పాడు. వారిద్దరూ శ్రీనివాస్ రెడ్డితోపాటు సూర్యాపేటకు వచ్చి కారు రిపేరు చేయించుకున్నారు. అక్కడి నుంచే హర్షా రెడ్డి తండ్రి లక్ష్మా రెడ్డికి ఫోన్ చేశారు.
హర్షా రెడ్డి మా అమ్మాయితో సూర్యాపేటలో దొరికాడు, అతన్ని వదలాలంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ షరతులు విధించి కాల్ కట్ చేశాడు. అనుమానం రాకుండా ఉండేందుకు హర్షా రెడ్డి ఫోన్ను అక్కడే పడేసి సిమ్ తీసుకున్నారు. అయితే కిడ్నాప్ చేసింది శ్రీనివాస్ రెడ్డేనని పోలీసులు అనుమానించి పలుమార్లు ఫోన్ చేశారు. తర్వాత టాస్క్ఫోర్స్ బృందానికి స్వయంగా ఫోన్ చేసిన శ్రీనివాస్ రెడ్డి అసలు కిడ్నాపర్లను చూపిస్తానంటూ చెప్పాడు.
ఒక సివిల్ పోలీస్ను తీసుకెళ్లి, మధ్యలోనే పారిపోయాడు. విషయాన్ని టాస్క్ఫోర్స్ బృందం వెంటనే విజయవాడ ఉన్నతాధికారులకు తెలిపింది. తన మనుషులైన రాజు, మురళిలకు ఫోన్ చేసి కిడ్నాప్ విషయం పోలీసులకు తెలిసిపోయిందని, హర్షా రెడ్డిని చంపేసి పారిపొమ్మని చెప్పాడు. వారు భయంతో హర్షా రెడ్డిని వదిలిపెట్టి పారిపోయారు. అయితే పోలీసులు పన్నిన వలలో నిందితులు చిక్కుకున్నారు. కిడ్నాప్కు ముందు హర్షా రెడ్డి ఇంటిపై రెండుసార్లు రెక్కీ నిర్వహించారని పోలీసులు చెప్పారు.
-
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications