హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే ఇంట్లో దొంగలు పడ్డారు: రూ.20 లక్షలు చోరీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nellore Map
ఒంగోలు: ప్రకాశం జిల్లా కండపి శాసనసభ్యుడు జివి శేషు ఇంట్లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఒంగోలు పట్టణంలోని క్లౌపేటలోని ఎమ్మెల్యే శేషు ఇంటి వెనుక ద్వారం పగులగొట్టిన దొంగలు లోనికి ప్రవేశించి నగదు, బంగారు ఆభరణాలు ఎత్తుకు వెళ్లారు. 20 లక్షల రూపాయల నగదు, రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగలు దోచుకు వెళ్లారు.

చోరీ జరిగినట్లు సోమవారం ఉదయం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంగోలు డిఎస్పీ ఎం రజనీకాంత్ రెడ్డి, సిఐలు కాసీం బేగ్, శ్రీనివాసన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఎమ్మెల్యే ఇంటితో పాటు మరో ఇంట్లో కూడా దొంగలు దోపిడీ చేశారు. శేషు ఇంటి పక్కన ఉన్న ఓ కానిస్టేబుల్ ఇంట్లోనూ దోపిడీ దొంగలు చోరీ చేశారు. అయితే కానిస్టేబుల్, కుటుంబం ఇంట్లో లేనందున ఆ ఇంట్లో ఎంత మేర దొంగతనం జరిగిందో తెలియరాలేదు. ఇటీవల దోపిడీ దొంగలు ప్రజాప్రతినిధుల ఇళ్లను టార్గెట్ చేసుకుంటుండటం గమనార్హం.

English summary
Theft occured in MLA GV Seshu residence on Sunday night in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X