వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండు రోజులు బాబుతో లోకేష్: కదం కలిపిన హరికృష్ణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna - Nara Lokesh
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా నీకోసం పాదయాత్రలో ఆయన తనయుడు నారా లోకేష్ కుమార్ రెండు రోజులు పాల్టొంటారని తెలుస్తోంది. పాదయాత్ర ప్రారంభానికి భార్య భువనేశ్వరి, లోకేష్, రాజ్యసభ సభ్యుడు, బావమరిది నందమూరి హరికృష్ణ తదితర కుటుంబ సభ్యులు వచ్చిన విషయం తెలిసిందే. భువనేశ్వరి హారతి ఇచ్చి పాదయాత్రను ప్రారంభింప చేశారు. అనంతరం హరికృష్ణ, లోకేష్‌లు బాబుతో కదం కలిపారు.

బాబుతో పాటు లోకేష్ పాదయాత్ర చేయనప్పటికీ రెండ్రోజులు ఆయనతో పాటు ఉంటారని సమాచారం. పాదయాత్రకు సంబంధించి ప్రత్యేకంగా తండ్రి అవసరాలను పర్యవేక్షించి.. ఇతరులకు సూచనలు ఇచ్చి ఆ తర్వాత అతను తిరిగి రానున్నారని తెలుస్తోంది. కాగా పాదయాత్ర సమయంలో లోకేష్ కొద్ది దూరం వెళ్లాక విరమించుకోవాలని చూడటంతో కార్యకర్తలు మరికొంత దూరం నడవాలని కోరారు. దీంతో ఆయన తన నడకను తండ్రితో పాటు కొనసాగించారు.

హరికృష్ణ మాత్రం కొద్దిసేపు నడిచి వెనుదిరిగారు. మరోవైపు బాబు ఆద్యంతం ఉల్లాసంగా కనిపించారు. పాదయాత్రలో బాబు తన రొటీన్ సీరియస్‌నెస్‌కు స్వస్తి చెప్పి అందరినీ ఆహ్లాదంగా పలకరించారు. కార్యకర్తలు, ప్రజల భుజాలపై చేయి వేసి పలకరించారు. పాదయాత్రకు హైదరాబాద్ నుంచి బయలు దేరింది మొదలు.. హిందూపురంలో పాదయాత్రలోనూ ఆయన ఆయన ఆహ్లాదంగా నవ్వుతూనే కనిపించారు.

చంద్రబాబు పాదయాత్ర విశేషాలను ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో ఇవ్వనున్నామని టిడిపి ఐటీ విభాగం అధిపతి శ్రీనివాస రావు మంగళవారం తెలిపారు. యాత్రకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు, పాటలు, పోస్టర్ల వంటివి తాజా విశేషాలతో కలిపి ఇస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ పార్టీ వెబ్‌సైట్‌లో ఉంటాయన్నారు.

English summary
Nara Lokesh Kumar is participating two days in his father and Telugudesam Party chief Nara Chandrababu Naidu's padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X