వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెళ్లినా నష్టంలేదు, 50వేల మెజార్టీ: అమర్నాథ్‌పై బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
అనంతపురం: పలమనేరు శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. పలమనేరు నియోజకవర్గానికి చెందిన టిడిపి నాయకులు, కార్యకర్తలు అనంతపురం జిల్లాలో వస్తున్నా నీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్ర సందర్భంగా కలిశారు. అమర్నాథ్ రెడ్డి పార్టీని వీడి వెళ్లినా ఎలాంటి నష్టం లేదని, కార్యకర్తలు ఎవరూ అతనితో వెళ్లలేదని వారు బాబుతో చెప్పారు.

అమర్నాథ్‌కు చాలా ప్రాధాన్యత ఇచ్చా

తాను అమర్నాథ్ రెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని బాబు ఈ సందర్భంగా వారితో చెప్పారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలను తాను తన సొంత నియోజకవర్గాల్లా చూసుకున్నానని చెప్పారు. ప్రవీణ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ స్వార్థంతోనే పార్టీని వీడుతున్నారన్నారు. ఆయన కుటుంబంతో తనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధముందని చెప్పారు.

అమర్నాథ్, ప్రవీల్‌లు పార్టీని వీడినా ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వారి కుటుంబంతో ఇన్నేళ్ల అనుబంధం తనకు ఉన్నప్పటికీ వారు ఇలా చేయడం తగదన్నారు. పలమనేరులో వచ్చే ఎన్నికలలో 50వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నేతలు వెళ్లినా టిడిపికి కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు.

యాత్ర ప్రారంభం

చంద్రబాబు పాదయాత్ర ఏడోరోజు ప్రారంభమైంది. కంబదూరు మండలం కుర్లపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. పలువురు రాష్ట్రస్థాయి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu said that there is no loss to TDP if Amarnath Reddy and Praveen Reddy will leave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X