వెళ్లినా నష్టంలేదు, 50వేల మెజార్టీ: అమర్నాథ్పై బాబు
అమర్నాథ్కు చాలా ప్రాధాన్యత ఇచ్చా
తాను అమర్నాథ్ రెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చానని బాబు ఈ సందర్భంగా వారితో చెప్పారు. పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాలను తాను తన సొంత నియోజకవర్గాల్లా చూసుకున్నానని చెప్పారు. ప్రవీణ్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు పార్టీకి ద్రోహం చేసి బయటకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర్నాథ్ స్వార్థంతోనే పార్టీని వీడుతున్నారన్నారు. ఆయన కుటుంబంతో తనకు ముప్పయ్యేళ్లుగా అనుబంధముందని చెప్పారు.
అమర్నాథ్, ప్రవీల్లు పార్టీని వీడినా ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. వారి కుటుంబంతో ఇన్నేళ్ల అనుబంధం తనకు ఉన్నప్పటికీ వారు ఇలా చేయడం తగదన్నారు. పలమనేరులో వచ్చే ఎన్నికలలో 50వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. నేతలు వెళ్లినా టిడిపికి కార్యకర్తలు ఎప్పుడూ అండగా ఉంటారన్నారు.
యాత్ర ప్రారంభం
చంద్రబాబు పాదయాత్ర ఏడోరోజు ప్రారంభమైంది. కంబదూరు మండలం కుర్లపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. పలువురు రాష్ట్రస్థాయి నేతలతో పాటు అనంతపురం జిల్లాలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.