హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను హైదరాబాదీని, ఇక్కడే పుట్టి పెరిగా: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: తాను హైదరాబాదీనే అని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారు. తాను హైదరాబాదులోనే పుట్టి పెరిగానని ఆయన అన్నారు. హైదరాబాదులోని చదువుకున్నానని అన్నారు. హైదరాబాదులోని చార్మినార్ వద్ద శుక్రవారం జరిగిన సద్భావనా యాత్రలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని ఆయన ప్రశంసించారు.

దేశంలో శాంతిని నెలకొల్పేందుకు గతంలో రాజీవ్ గాంధీ చేసిన సద్భావనా యాత్ర భారతీయులందరినీ ఏకతాటి మీదికి తీసుకుని వచ్చిందని ఆయన అన్నారు. పాతబస్తీ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

వంద ఎకరాల్లో పాతబస్తీలో గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అక్షరాస్యతలో మన రాష్ట్రం చాలా వెనకబడి ఉందని, అక్షరాస్యతను పెంచడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.

అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా మారిందని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని కొనియాడారని ఆయన గుర్తు ేచశారు. వచ్చే ఏడాది ప్రపంచ వ్యవసాయ సదస్సు కూడా హైదరాబాదులోనే జరుగుతుందని ఆయన చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ న్యాయవాదుల జెఎసి నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
CM Kiran Kumar Reddy said that he belongs to Hyderabad. He also told that he has born in Hyderabad and studied here. He said that Hyderabad old city will be developed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X