షర్మిల 'బాణం'పై టిడిపి కౌంటర్: ఏసు జైలుకు పంపారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతిని సహించలేక ఆ ఏసుక్రీస్తుయే ఆతనిని జైలులో పెట్టించాడని విమర్శించారు. షర్మిల, విజయమ్మలు బైబిల్ చేతపట్టుకొని పాదయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాలలోకి మతాన్ని తీసుకు రావొద్దని హితవు పలికారు. జగన్ తాను అక్రమంగా సంపాదించిన ఆస్తిని రాష్ట్రంలోని చర్చిలకు ఉదారంగా ఇస్తే బాగుంటుందని రాజేంద్ర ప్రసాద్ ఆ పార్టీకి హితవు పలికారు.
వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కండరాల నొప్పితో బాధపడుతున్నారని అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి తీసుకునేందుకు ఆయన ససేమీరా అంటున్నారని చెప్పారు. దసరా పండుగకు సైతం పాదయాత్రను తాత్కాలికంగా ఆపేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరని చెప్పారు. చంద్రబాబు పద్దెనిమిదవ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుండి ప్రారంభమయింది.
కాగా గురువారం రాత్రి చంద్రబాబు నాయుడుకు కాళ్లు బాగా నొప్పులు లేచాయి. కండరాలు పట్టాయి. దీంతో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. కానీ చంద్రబాబు మాత్రం పాదయాత్రకే మొగ్గుచూపారు. ఉదయానికల్లా కాలి నొప్పులు తగ్గాయి.