శ్రీనగర్ వద్ద టెర్రరిస్టుల కాల్పులు: ఒకరి మృతి

Terrorists
శ్రీనగర్: చాలా కాలం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు తమ ఉనికిని చాటుకున్నారు. శ్రీనగర్ శివారులో ఉన్న ఓ ప్రముఖ హోటల్ వద్ద ఉగ్రవాదులు సైనిక పటాలంపై శుక్రవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మే మాసం తర్వాత ఇటువంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం.

పరింపోరా - పంథాచౌక్ బైపాస్ రోడ్డు మీద ఉన్న లస్జాన్ సమీపంలోని సిల్వర్ స్టార్ హోటల్ సమీపంలో ఉగ్రవాదాలుపై ఆర్మీ కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం గం. 4.20 నిమిషాలకు జరిగింది.

హోటల్ బెల్ బాయ్ మరణించగా, మరో ఇద్దరు ఈ కాల్పుల్లో గాయపడ్డారు. సైనిక వాహనం కాల్పుల్లో ధ్వంసమైంది. సైనిక సిబ్బంది ప్రాణాలకు ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాది మేలో ఖన్యార్‌లో సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై కాల్పులు జరిపిన తర్వాత అటువంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి.

భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు 20 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+