Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పుణ్యమే: భూమన, 'జైలుకెందుకెళ్లాడో తెలియదా'

Bhuma Nagi Reddy
కర్నూలు/కడప: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కారణంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున కేంద్రమంత్రి పదవులు వచ్చాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గురువారం అన్నారు. రాష్ట్రానికి పది కేంద్ర పదవులు దక్కడం జగన్ పుణ్యమే అన్నారు. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెసు పార్టీ నేతలకు పదవులను కట్టబెట్టిందని ఆయన విమర్శించారు.

ఈ నెల 8వ తేది నుంచి కర్నూలు జిల్లాలో వైయస్ జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నాలు చేయలేదని, కానీ ఇప్పుడు అధికారం కోసం ఆయన వస్తున్నా మీకోసం అంటూ పాదయాత్రతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారన్నారు. ఆయనను ఎవరూ నమ్మడం లేదన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియదా అని రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి వేరుగా అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర కొనసాగితే తమ పార్టీలకు ఎక్కడ నూకలు చెల్లిపోతాయో అనే భయంతో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ఆయనను జగన్‌ను జైలుకు పంపించాయన్నారు.

జగన్‌ను జైలులో పెట్టి కిరణ్ ఇందిర బాట, చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్రలు కొనసాగిస్తున్నారని, ఇది కుట్రలో ఓ భాగం అన్నారు. రాష్ట్రంలో విశ్వసనీయత ఉన్న పార్టీ ఒక్క వైయస్సార్ కాంగ్రెసు మాత్రమే అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+