కెసిఆర్పై జగ్గారెడ్డి నిప్పులు: రెచ్చగొట్టవద్దన్న విహెచ్
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ సొంతగా నిర్ణయం తీసుకోలేదన్నారు. భాగస్వామ్య క్షాలతో మాట్లాడకుండా ఎలా నిర్ణయం తీసుకుంటామన్నారు. 2009 ఎన్నికల్లో మేనిఫెస్టోలో తాము తెలంగాణ ఇస్తామని పొందుపర్చనప్పటికీ... సోనియా గాంధీ తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఇచ్చేందుకు అధిష్టానం ఆలోచిస్తోందన్నారు. కొంతమంది తెలంగాణ కాంగ్రెసు ఎంపీలు టిఆర్ఎస్కు ఏజెంట్లుగా మారారని విమర్శించారు.
కెసిఆర్ తెలంగాణ కవాతుకు రాకుండా, తెలంగాణ కోసం చివరి ఊపిరి వరకు పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమ పార్టీ కెసిఆర్ను ఢిల్లీకి పిలవలేదన్నారు. టిఆర్ఎస్ పార్టీగా కాకుండా లిమిటెడ్ కంపెనీగా పని చేస్తోందన్నారు. టిఆర్ఎస్ నేతలకు తెలంగాణ రావాలనే చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెసు తెలంగాణపై ఎప్పుడూ డెడ్ లైన్ పెట్టలేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసిఆర్ మోసపూరిత మాటలను అర్థం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణను నష్టపరిచే ఉద్యమాలకు తాను వ్యతిరేకం అన్నారు. కెసిఆర్ది తెలంగాణపై రెండు నాల్కల ధోరణి అన్నారు. తెలంగాణ ఉద్యోగులను మోసం చేసింది తెరాసయే అన్నారు. డెడ్ లైన్లు పెట్టి ప్రజలను కెసిఆర్ మభ్యపెట్టారని విమర్శించారు. తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారని, కెకె తెరాసకు వత్తాసు పలకడం శోచనీయం అన్నారు. తెరాస ఓ డ్రామాల పార్టీ అన్నారు. తెలంగాణతో పాటు తనకు అభివృద్ధి కూడా ముఖ్యమన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారన్నారు. ఎవరు వెళ్లినా పార్టీకి నష్టం లేదన్నారు. కెసిఆర్ పల్లెబాటను కేవలం ఓట్లు సీట్ల కోసమే చేస్తున్నారని, తెలంగాణ కోసం కాదన్నారు. కెసిఆర్ నోటికి ఏది వస్తే అది మాట్లాడతారని వి హనుమంత రావు మండిపడ్డారు. రెచ్చగొట్టేలా మాట్లాడి ఆత్మహత్యలను ప్రోత్సహించవద్దన్నారు. తెలంగాణ కౌన్సిల్కు తాము ఒప్పుకున్నా తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.