హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్, గాలి రిమాండ్ 22 వరకు పొడగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రిమాండ్‌ను కోర్టు గురువారం ఈ నెల 22వ తేదీ వరకు పొడగించింది. అక్రమాస్తుల కేసులో ఆయన హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో నిందితుడైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రిమాండ్‌ను కూడా కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో, ఒఎసి కేసులో, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితులైన మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్, బివి శ్రీనివాస రెడ్డి, సునీల్ రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సైతం కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. వారి రిమాండ్ గురువారం ముగిసింది.

దీంతో నాంపల్లి సిబిఐ కోర్టు వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ అనంతరం వారి రిమాండ్‌ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి ధర్మాన ప్రసాద రావు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి, ఐఎఎస్ అధికారులు శామ్యూల్, బిపి ఆచార్య గురువారం కోర్టుకు హాజరయ్యారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అప్పీలేట్ అథారిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమ ఎదుట వచ్చే నెల 17వ తేదిన హాజరు కావాలని ఈడి అప్పీలేట్ అథారిటీ నోటీసులో జగన్‌ను ఆదేశించింది. జగన్‌తో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదిన తమ ఎదుట హాజరు కావాలని ఎమ్మార్‌‍ను ఈడి ఆదేశించింది.

English summary
CBI special court has extended YSR Congress president YS Jagan's remand till november 22 in DA case. The remand of Karnataka former minister Gali Janardhan Reddy's remand also extended.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X