వైయస్ జగన్, గాలి రిమాండ్ 22 వరకు పొడగింపు
వైయస్ జగన్ ఆస్తుల కేసులో, ఒఎసి కేసులో, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితులైన మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, రాజగోపాల్, బివి శ్రీనివాస రెడ్డి, సునీల్ రెడ్డి, అలీఖాన్ల రిమాండ్ను సైతం కోర్టు ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది. వారి రిమాండ్ గురువారం ముగిసింది.
దీంతో నాంపల్లి సిబిఐ కోర్టు వారిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ అనంతరం వారి రిమాండ్ను పొడగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రి ధర్మాన ప్రసాద రావు, జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి, ఐఎఎస్ అధికారులు శామ్యూల్, బిపి ఆచార్య గురువారం కోర్టుకు హాజరయ్యారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అప్పీలేట్ అథారిటీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమ ఎదుట వచ్చే నెల 17వ తేదిన హాజరు కావాలని ఈడి అప్పీలేట్ అథారిటీ నోటీసులో జగన్ను ఆదేశించింది. జగన్తో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్కు కూడా ఈడి నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదిన తమ ఎదుట హాజరు కావాలని ఎమ్మార్ను ఈడి ఆదేశించింది.