హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిక్కర్ బాటిల్‌పై గొడవ, మహిళ దారుణ హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Woman killed on liquor battle issue
హైదరాబాద్: లిక్కర్ బాటిల్ కోసం ఓ మహిళను గొంతు పిసికి హత్య చేసిన ఘటన సికింద్రబాద్‌లో చేటు చేసుకుంది. హత్యకు కారణమైన ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా లింగంపల్లి మండలం మోతే గ్రామానికి చెందిన పెంటయ్య భార్య కె.సాయమ్మ (40), అదే ప్రాంతానికి చెందిన శోభ (35) యాచకులు. అక్టోబర్ 17న వీరు డబిల్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలో కలుసుకున్నారు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో మద్యం బాటిల్ కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

రైల్వే పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం - సాయమ్మ వెంటనే తన సోదరుడు హనుమాండ్లను ఫోన్ చేసి ఘటనా స్ధలానికి పిలిపించింది. శోభను హత్య చేసేందుకు అప్పటికప్పుడు వారు పథకం వేసుకున్నారు. రైల్వేస్టేషన్ సమీపంలో చెట్లపొదల్లో నిలబడి ఉన్న శోభను కిందపడేసి గొంతు పిసికి చంపారు. అనంతరం అక్కడినుంచి పారిపోయారు.

రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్ధానికులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ రైల్వే ఇన్‌స్పెక్టర్ అశోక్‌కుమార్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సీఐ అశోక్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన బృందం హత్యా స్థలం వద్దకు ప్రతి రోజూ సాయమ్మ వస్తున్నట్టు తెలుసుకున్నారు.

ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా సోదరుడితో కలిసి హత్య చేసినట్టు అంగీకరించింది. దీంతో పోలీసులు సాయమ్మ, హనుమాండ్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకున్న సీఐ అశోక్‌కుమార్ నేతృత్వంలోని బృందాన్ని సికింద్రాబాద్ జిల్లా రైల్వే ఎస్పీ కాంతారావు అభినందించారు. కానిస్టేబుళ్లు కొండల్‌రెడ్డి, వెంకటేశ్వర్లుకు నగదు రివార్డు అందించారు.

English summary
Dispute over a liquor battle lead to a murder of a woman. Railway police arrested two accused in the murder case. This was occured at Addagutta of Secendurabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X