డాక్టర్ అకౌంట్ హ్యాక్: రోమ్నీ ఖాతాలోకి 3.52 లక్షలు
యాక్సిస్ బ్యాంకులోని ఆయన ఖాతా అక్టోబర్ పదవ తేదిన హ్యాకింగ్కు గురైంది. హ్యాకర్లు ఆయన ఖాతా నుండి రూ.3.52 లక్షలను అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో గల రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి మిట్ రోమ్నీ ప్రచార నిధి ఖాతాకు మళ్లించారు. ఈ విషయాన్ని పాట్నాలోని శ్రీకృష్ణపురి పోలీసు స్టేషన్ అధికారి సంజయ్ పాండే బుధవారం తెలియజేశారు.
తన ఖాతా నుండి డబ్బులు డెబిట్ అయినట్లుగా తనకు ఓ సంక్షిప్త సందేశం(ఎస్సెమ్మెస్) వచ్చిదని డాక్టర్ వర్మ చెబుతున్నాడు. తనకు సందేశం వచ్చిన వెంటనే తాను పోలీసులను ఆశ్రయించానని, దీంతో తన అకౌంట్ హ్యాక్ అయి, రోమ్నీ ఖాతాలోకి డబ్బులు వెళ్లినట్లుగా వెలుగులోకి వచ్చిందని చెబుతున్నారు.
పూరి ఉత్తర శ్రీకృష్ణపురిలో ఉంటాడు. వర్మకు మెసేజ్ రావడంతో తమను ఆశ్రయించాడని కేసు విచారణ జరుపుతున్న పాండే తెలిపాడు. బీహార్ డిజిపి అభయానంద్ మాట్లాడుతూ... సైబర్ క్రైమ్ పోలీసు కేసును నమోదు చేసుకుందని, కేసులో పురోగతి సాధిస్తున్నామని చెప్పారు. డాక్టర్ తన అకౌంట్ను బ్లాక్ చేశారు.