అనుమానంతో భార్యను చంపి భర్త ఆత్మహత్య
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఖాపర్ఖేడ పోలీసులు తలుపులు బద్దలు కొట్టి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న దంపతుల శవాలను కనుక్కున్నారు. నీలం (35) శవం పడకపై పడి ఉండగా, ఆమె భర్త కుశ్వా శవం ఇంటి పైకప్పునకు దుపట్టాతో వేలాడుతూ కనిపించింది.
కుశ్వా నాలుక నోటి బయటకు వచ్చింది. దీన్నిబట్టి భర్త ఆమెను ఉరేసి చంపి ఉంటాడని భావిస్తున్నారు. శవాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన నాలుగు రోజుల క్రితం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. నవంబర్ 5వ తేదీ నుంచి వార్తాపత్రికలు తలుపు దగ్గరే పడి ఉన్నాయి. దాన్ని బట్టి సంఘటన నవంబర్ 4వ తేదీన జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
కుశ్వా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తుండగా నీలం హౌస్ వైఫ్ మాత్రమే. దంపతులు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. కుశ్వా ఉత్తరప్రదేశ్లోని తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. నీలం కూడా తన మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆరేళ్ల క్రితం నీలం, కుశ్వా పెళ్లి చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు.