పాలమూరు కాంగ్రెసులో చిచ్చు: పార్టీ ఆఫీసుకు నిప్పు
పోలీసులకు ఫోన్ చేశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చాయి. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కుర్చీలు, బల్లలు తదితర ఫర్నిచర్, పార్టీ జెండాలు, పలు బ్యానర్లు కాలిపోయాయి. ఎవరో ఉద్దేశ్య పూర్వకంగానే నిప్పు పెట్టి ఉండవచ్చుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు యువజన కాంగ్రెసు నాలుగు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం ఉంది. ఆ తర్వాత డిసిసి మేధోమథన సదస్సు ఉంది. రెండు సమావేశాలు ఉన్న రోజు నిప్పు పెట్టడం పార్టీలోని విభేదాలు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందంటున్నారు. నిప్పు పెట్టిన వారు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఎవరో ఒక వ్యక్తి ఉదయం వచ్చి సమావేశం ఉన్నందున పార్టీ కార్యాలయం తాళాలు ఇవ్వమన్నారని, రెండు నిమిషాల తర్వాత చూస్తే మంటలు చెలరేగాయని, ఆ తర్వాత తాళం చెవి తీసుకున్న వ్యక్తి పారిపోయాడని వాచ్ మెన్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని భావిస్తున్న వారు నిప్పు పెట్టారా లేక సమావేశంలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్న వారు నిప్పు పెట్టారా అనే చర్చ జరుగుతోంది. గతంలో రెండుసార్లు ఇలాగే నిప్పు పెట్టారు.