ఎవరూ మాట్లాడొద్దు: అఖిలపక్షంపై తమ్ముళ్లకు బాబు

అంతకుముందు ఉదయం ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. తెలుగు తమ్ముళ్లకు అఖిల పక్షంపై ఏమీ మాట్లాడవద్దని సూచించారు. 28వ తేదిన జరగనున్న ఆల్ పార్టీ సమావేశంపై ఎవరూ మీడియాకు ఎక్కవద్దని సూచించారు. కేంద్ర హోంశాఖ విధివిధానాలు పరిశీలించాక స్పందించుదామని చెప్పారు. మనం అఖిలపక్షానికి హాజరై, నిర్ణయాన్ని వెల్లడించుదామని చెప్పారు. కేంద్రం విధి నిర్ణయాలు విడుదలయ్యే వరకు ఎవరూ మాట్లాడవద్దన్నారు.
కాగా చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఉదయం బాసర సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 62వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. మైలాపూర్, త్రిపుల్ఐటీ మీదుగా ముదోల్ వరకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజలు మొత్తం 16 కి.మీ మేర బాబు పాదయాత్ర కొనసాగనుంది.
తెలంగాణకు అనుకూలమని చెప్పాలి
తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేస్తున్న నేతలు తెలంగాణకు తాము అనుకూలమని అఖిలపక్ష భేటీలో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. అఖిలపక్షం డిమాండ్ చేసిన పార్టీలు తమ విధానాలు మార్చుకుంటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. వైయస్ విజయమ్మ స్వయంగా అఖిల పక్షానికి హాజరై తెలంగాణకు అనుకూలమని చెప్పాలన్నారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications