కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళపై ఇద్దరు యువకుల రేప్: మెడికో ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Medico commits suicide
హైదరాబాద్/శ్రీకాకుళం: రాజధానిలో దారుణం జరిగింది. ఓ వివాహితపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడ్డ సంఘటన హైదరాబాదులోని అంబరుపేటలో చోటు చేసుకుంది. అంబరుపేటలోని దుర్గానగర్‌లో ఓ జంట ఉంటోంది. వారు మహారాష్ట్రకు చెందిన వారు. కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న భార్య పైన ఇలియాక్, అఫాక్ అనే ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలు అంబరుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెట్విన్ బస్సులో కండక్టర్‌గా పని చేస్తున్న తన భర్త రాత్రి డ్యూటీకి వెళ్లడంతో తాను ఒక్కదానినే ఇంట్లో ఉన్నానని, ఆ సమయంలో వారు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని తెలిపింది. పోలీసులు ఇలియాక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అఫాక్ పరారీలో ఉన్నాడు. అతని గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

మెడికో ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా జేమ్స్ మిడికల్ కళాశాలలో ఓ వైద్య విద్యార్థిని ఉరి వేసుకొని చనిపోయింది. ఐశ్వర్యసాయి అనే మెడికో ఆదివారం ఉదయం ఉరివేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అయితే రాత్రి డిన్నర్ సమయంలో తోటి వారితో కలిసి ఆమె డిన్నర్ చేయలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమె ఉరి వేసుకొని ఉండవచ్చునని అంటున్నారు. ఐశ్వర్యసాయి స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం.

భార్యకు నిప్పు

కడప జిల్లాలోని బద్వేలు రాజుగారి వీధిలో ఓ భర్త కుటుంబ కలహాల కారణంగా తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో భార్య మృతి చెందింది.

English summary

 A medical student Aishwarya Sai committed suicide by hanging her self in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X