ప్రణబ్ ఎదుట జై తెలంగాణ స్లోగన్: అదుపులోకి డాక్టర్
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎదుట ఓ వైద్యుడు గురువారం జై తెలంగాణ నినాదాలు చేశాడు. హైదరాబాదులోని హెచ్ఐసిసిలో 28వ ఆసలియా - ఫసిఫిక్ నేత్ర వైద్యుల సంఘం సదస్సులో ప్రణబ్ ముఖర్జీ ఎదుట డాక్టర్ నరేందర్ రెడ్డి అనే వైద్యుడు జై తెలంగాణ నినాదాలు చేశాడు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఆయన ఆ నినాదాలు చేయడంతో ఒక్కసారిగా కలకలం బయలుదేరింది. వైద్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని బయటకు తీసుకుని వచ్చారు.
ఆసియా
-
ఫసిఫిక్
నేత్ర
వైద్యుల
సంఘం
సదస్సును
రాష్ట్రపతి
ప్రణబ్
ముఖర్జీ
గురువారంనాడు
ప్రారంభించారు.
సదస్సు
ప్రారంభోత్సవ
సమావేశానికి
గవర్నర్
నరసింహన్తో
పాటు
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డి
గౌరవ
అతిథులుగా
హాజరయ్యారు.
ఈ
సదస్సుకు
ఈజిప్టు,
రష్యా,
పాకిస్తాన్
తదితర
దేశాల
నుంచి
పది
వేల
మంది
కంటి
వైద్యులు,
శస్త్రచికిత్స
నిపుణులు
హాజరయ్యారు.
ఈ సదస్సును ప్రారంభించడానికి ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వచ్చిన ప్రణబ్ ముఖర్జీకి విమానాశ్రయంలో ముఖ్యమంత్రి తదితరులు స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి ప్రణబ్ ముఖర్జీ నేరుగా హైటెక్స్కు చేరుకున్నారు. సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తి కాగానే ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోయారు.