మోడీ స్వీప్: 90 శాతం ముస్లింలు బిజెపికే ఓటు
బిజెపి నిలబెట్టిన 27 మంది అభ్యర్థుల్లో 24 మంది ముస్లింలే. మిగతా ముగ్గురు హిందువుల్లో ఒకరు ఎస్టీ. బిజెపి అభ్యర్థులకు 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది వార్డుల్లో విస్తరించిన 27 సీట్లలో నలుగురు బిజెపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 23 సీట్లకు ఆదివారం పోలింగ్ జరిగింది. కాంగ్రెసు బిజెపితో ముఖాముఖి తలపడింది. కాంగ్రెసు పార్టీ అన్ని సీట్లలో ఓడిపోవడమే కాకుండా మూడు సీట్లలో ధరావత్తు కోల్పోయింది.
సలయా ఎస్సార్ ఎనర్జీస్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జిక్ కంపెనీ స్థాపించిన 1200 మెగావాట్ల విద్యుదుత్పత్తి ఫలాలను అనుభవిస్తోంది. సలయా ఎస్సార్ ఎనర్జీ తొలి బొగ్గు ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టుల. దాన్ని 1.1 బిలియన్ డాలర్ల వ్యయంతో నెలకొల్పారు. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్తును దీర్ఘకాలిక కాంట్రాక్టుపై గుజరాత్ రాష్ట్ర ఎలక్ట్రిక్ యుటిలిటీ జియువిఎన్ఎల్కు సరఫరా చేస్తుంది. అన్ని యూనిట్లు పని చేయడం ప్రారంభిస్తే 2000 మెగావాట్ల విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది.
అత్యాధునాత సౌకర్యాలతో సలయాలో ప్రపంచ శ్రేణి మెరైన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కూడా వస్తోంది. జెట్టీని సలయా హార్బర్లో నెలకొల్పారు. సలయాలో ఎస్సార్ సామాజిక అభివృద్ధి చర్యల కింద పలు ప్రాజెక్టులను చేపట్టింది. మహిళా సాధికారత కోసం ఎస్సార్ ఫౌండేషన్ సలయాలో ఓ స్టిచ్చింగ్ సెంటర్ను నడుపుతోంది. అక్షరాస్యత, వ్యక్తిత్వ వికాసం, గణాంకాలు వంటి పలు విషయాల్లో ఆ కేంద్రం మహిళలకు శిక్షణ ఇస్తోంది.