వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలకవీడిన కావూరి పార్లమెంట్‌కు: గేటు వద్ద తెలంగానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kavuri Sambasiva Rao
న్యూఢిల్లీ: కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అలక వీడారు. ఆయన గురువారం పార్లమెంటుకు హాజరయ్యారు. ఈ రోజు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ప్రణబ్ ప్రసంగానికి ఇన్నాళ్లూ అసంతృప్తితో ఉన్న కావూరి సాంబశివ రావు హాజరయ్యారు.

ప్రధాన ద్వారం వద్ద తెలంగానం

బడ్జెట్ సమావేశాల తొలిరోజే పార్లమెంటుకు తెలంగాణ సెగ తగిలింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు.

కేంద్రం ప్రకటించిన తెలంగాణను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించిందని, ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ బాధ్యత కేంద్రందే అన్నారు.

కాగా అంతకుముందు బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి భవనం నుండి పార్లమెంటుకు బయలుదేరారు. సంప్రదాయబద్ధంగా అశ్వారూఢులైన సిబ్బంది రాష్ట్రపతిని ఆయన ప్రత్యేక వాహనంలో పార్లమెంటు భవనానికి తీసుకు వచ్చారు.

English summary
Eluru MP Kavuri Sambasiva Rao attended Parliament Budget sessions on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X