ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అవిశ్వాసం పెట్టి తుస్సుమనిపించారు: చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి తుస్సుమనిపించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పశ్సిమ గోదావరి జిల్లా పాదయాత్ర కొనసాగిస్తున్న ఆయన శనివారం తణుకు మండలం పైడిపర్రులో పార్టీ కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన సమస్యలపై చర్చించుకుండానే అవిశ్వాసం పెట్టారని ఆయన అన్నారు.

నాలుగేళ్లుగా ప్రజా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రజా సమస్యలపై పెట్టాలని ఆయన అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి తుస్సుమనిపించారని ఆయన అన్నారు. బ్లాక్ మెయిల్ కోసం తెరాస, లాలూచీ కోసం వైయస్సార్ కాంగ్రెసు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయని ఆయన అన్నారు.

శాసనసభా సమావేశాలు నడిచే పరిస్థితి లేదని ఆయన అన్నారు. వాయిదా పడుతూ పోతుందని, ప్రభుత్వం దాన్నే కోరుకుంటోందని ఆయన అన్నారు. తనను ఇబ్బందుల్లో పెట్టాలని వైయస్ రాజశేఖర రెడ్డి చాలా ప్రయత్నించాడు గానీ ఏమీ చేయలేకపోయాడని ఆయన పైడిపర్రులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.

English summary
Telugudesam president Nara Chandrababu Naidu has opposed the attitude of YSR Congress and Telangana Rastra Samithi (TRS) in proposing No Confidence Motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X