ఎవరేం చేస్తున్నారు?: జైలు నుండే లీడ్ చేస్తున్న జగన్

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తున్నారట. అక్రమాస్తుల కేసులో గతేడాది మే 27వ తేదిన అరెస్టైన వైయస్ జగన్ జైలులో తనను ములాకత్ సమయంలో కలుస్తున్న పలువురు నేతలతో పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్నారట. పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లడం, బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని నేతలను, కార్యకర్తలను ఆదేశిస్తున్నారట.

జగన్ జైలుకు వెళ్లిన తర్వాత విజయమ్మ చేసిన దీక్షలు, పార్టీ బలోపేతం కోసం జగన్ సోదరి చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర తదితర కార్యక్రమాలు అన్ని జగన్ అనుమతితో జరిగినవే. ఇలాంటి మేజర్ విషయాలే కాకుండా ఆయా నియోజకవర్గాలలోని పార్టీ పైనా ఆయన జైలులో ఉన్నప్పటికీ దృష్టి సారించారట. తనను కలుస్తున్న నేతలను ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారట.

పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశంపై వారి నుండి ఆరా తీస్తున్నారు. అంతేకాదు, జైలులో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో పార్టీ నుండి టిక్కెట్స్ ఇచ్చే అభ్యర్థుల ఎంపిక పైనా కసరత్తు చేస్తున్నారట. తనను కలుస్తున్న పలువురికి టిక్కెట్ పైన హామీ ఇవ్వడమే కాకుండా నియోజకవర్గంలో పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని సూచిస్తున్నారట.

పార్టీలో నాయకుల తీరుపై ఎప్పటికప్పుడు జగన్ దృష్టికి వెళ్తోందట. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా ఇది చెప్పారు. పార్టీలో ఏయే నాయకులు ఏ రోజు ఏం చేస్తున్నారు? పార్టీ పటిష్టత కోసం ఏం చేస్తున్నారు? తదితర సమాచారం జగన్ వద్దకు ఎప్పటికి అప్పుడు చేరుతోందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+