తెర పైకి కేశినేని నాని: దేవినేనికి గద్దె సవాల్ వెనుక..!

కేశినేని నాని కంటే ముందే గద్దె పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసి విజయవాడ పార్లమెంటు స్థానాన్ని కోరినట్లుగా చెబుతున్నారు. మరోవైపు గన్నవరం స్థానాన్ని వల్లభనేని వంశీ ఆశిస్తున్నారు. జిల్లా టిడిపి అధ్యక్షుడైన దేవినేనికి వారితో అంతగా పడదు. దీంతో వారికి చెక్ చెప్పేందుకు కేశినేని నానిని దేవినేనే తెర పైకి తీసుకు వచ్చి ఉంటారనే ప్రచారం సాగుతోంది.
గన్నవరం టిక్కెట్ విషయంలో కూడా దేవినేని సిట్టింగ్ ఎమ్మెల్యేకు అండగా నిలబడుతున్నారు. అదే స్థానాన్ని వంశీ ఆశిస్తున్నారు. కేశినేని నానిని తెరపైకి తేవడంలో దేవినేని ఉమామహేశ్వర రావు పాత్ర ఉందని భావించడం వల్లనే గద్దె రామ్మోహన రావు అతనిని సోదరుడు దేవినేని నెహ్రూ పైన పోటీ చేయాలనే అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారంటున్నారు.
అయితే, గద్దె మాత్రం విజయవాడ ఎంపీ టిక్కెట్ పైన వెనక్కి తగ్గటం లేదు. అదే సమయంలో దేవినేని ఉమామహేశ్వర రావును కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, ఆయన సోదరుడు అయిన దేవినేని నెహ్రూ పైన పోటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బెజవాడ టిడిపిని సర్దుబాటు చేయలేక పార్టీ అధ్యక్షుడు సతమతమవుతున్నారట.












Click it and Unblock the Notifications