వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు పోలీసులకు ఉరిశిక్ష: 31 ఏళ్లకు తీర్పు

By Pratap
|
Google Oneindia TeluguNews

Uttar Pradesh
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఓ పోలీసాఫీసరును, 12 మంది గ్రామస్తులను బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపడానికి కుట్ర చేసి చంపిన కేసులో 31 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఎనిమిది మంది పోలీసులను సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. వీరిలో ముగ్గురికి ఉరిశిక్షను, ఐదుగురికి జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. బూటకపు ఎన్‌కౌంటర్‌లోనే వారిని చంపారని నిర్ధారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాజేంద్ర సింగ్ శుక్రవారం శిక్షలను ఖరారు చేశారు.

31 ఏళ్ల నాటి ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ కౌదియా సరోజ్, హెడ్ కానిస్టేబుల్ రామ్ నాయక్, కానిస్టేబుల్ రామ్ కరణ్‌లకు ఉరిశిక్ష విధించింది. పీఏసీ కమాండెంట్ రమాకాంత్ దీక్షిత్, ఎస్సైలు నసీమ్ అహ్మద్, మంగళ్ సింగ్, పర్వేజ్ హుస్సేన్, రాజేంద్ర ప్రసాద్ సింగ్‌లకు జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది.

సంఘటన వివరాల్లోకి వెళ్తే - 1982 మార్చి 12వ తేదీన గోండా జిల్లాలోని మాదోపూర్ గ్రామం వద్ద 13 మంది హత్యకు గురయ్యారు. మృతుల్లో డీఎస్పీతో సహా 12 మంది గ్రామస్థులు ఉన్నారు. వారిని పోలీసులే కాల్చి చంపారు. 12 మంది అమాయకులను బందిపోట్లుగా చిత్రీకరించారు. వారు డిఎస్పీ కెపి సింగ్‌ను కూడా కాల్చి చంపారు. అయితే డీఎస్పీ భార్య విభా సింగ్ మాత్రం దీన్ని ఎన్‌కౌంటర్‌గా అంగీకరించలేదు.

తన భర్తను పోలీసులే చంపి ఉంటారనే అనుమానంతో ఆమె న్యాయపోరాటం ఆరంభించారు. దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో సుప్రీంకోర్టు ఈ సంఘటనపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ రంగప్రవేశంతో అసలు గుట్టు బహిర్గతమైంది. సాటి పోలీసులే తమ సహచరులను హతమార్చారని సీబీఐ నిర్ధారించింది.

19 మంది పోలీసులపై నేరాభియోగాలను నమోదు చేసింది. అయితే న్యాయ విచారణ 31 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగడంతో 10 మంది నిందితులు విచారణ మధ్యలోనే చనిపోయారు. మరో పోలీసు అధికారి ప్రేమ్ సింగ్‌పై మోపిన అభియోగాలు రుజురు కాకపోవడంతో ఆయన కేసు నుంచి బయటపడ్డారు.

English summary
More than 30 years after a police officer and 12 villagers were killed in Gonda district of Uttar Pradesh, a CBI court has held eight cops guilty of plotting their murder in a fake encounter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X