కూతురును వేధించవద్దన్న తల్లిని లారీ కిందకు తోశారు

వారు గాంధీ చక్ వద్దకు వచ్చినప్పుడు కొందరు దుండగులు కూతురును వేధించారు. తల్లీకూతుళ్లు భయపడ్డారు. కూతురును ఏమైనా అంటారేమోననే ఆందోళనతో తన కూతురును వేధించవద్దని వారిని హెచ్చరించింది. మద్యం మత్తులో ఉన్న దుండగులు తల్లిని అటుగా వస్తున్న లారీ కింద తోసేశారు.
దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తల్లిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కూతురు బిటెక్ చదువుతోంది. తల్లి మరణ వార్త విని కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈవ్ టీజింగ్ కేసులో పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. రాత్రి నలుగురిని, ఉదయం ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. నిందితులు ఈవ్ టీజింగ్ చేస్తున్నప్పుడు ఓ పోలీసు అక్కడే ఉన్నారని, పోలీసుల నిర్లక్ష్యమే తన తల్లి ప్రాణాన్ని బలిగొందని మృతురాలి కూతురు మౌనిక ఆరోపిస్తున్నారు. కాగా ఈ కేసులో కీలక ఏడో నిందితుడు ఓ నేత తనయుడుగా చెబుతున్నారు. అందుకే ఆయనను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
రైళ్లో దొంగతనం
పద్మావతి ఎక్సుప్రెస్లో మంగళవారం తెల్లవారుజామున దొంగలు మహిళా ప్రయాణీకుల మెడల్లోని బంగారు గొలుసులను ఎత్తుకుపోయారు. వేకువజామున మూడున్నర గంటల ప్రాంతంలో రైలు ఒంగోలు సమీపంలో ఉన్నప్పుడు ప్రయాణీకులు నిద్రలో ఉండగా ఇది జరిగింది. బాధితులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లురు జిల్లాలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విజయవాడలో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు
కృష్ణా జిల్లా విజయవాడలోని గొల్లపూడి కొత్త మార్కెట్ యార్డులో కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఇందులో మూడు కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా సమాచారం.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications