Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పార్టీలోకి లగడపాటి సన్నిహితుడు అడుసుమిల్లి?

Adusumilli Jayaparakash
విజయవాడ: విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ సన్నిహితుడు అడుసుమిల్లి జయప్రకాశ్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. లగడపాటి కరడుగట్టిన సమైక్యవాది అని తెలిసిన విషయమే. అడుసుమిల్లి కూడా అతనికి మద్దతుగా పలు సందర్భాల్లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవద్దని చెప్పి సమైక్యవాదిగా ముద్రపడ్డారు.

లగడపాటికి సన్నిహితుడు అయిన ఇతను మరో సన్నిహితుడి సలహా మేరకు జగన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పొట్లూరి వరప్రసాద్ పేరు ప్రచారంలో ఉంది. ఇతనికి అడుసుమిల్లి సన్నిహితుడు. పొట్లూరి సూచనల మేరకే అతను జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.

ఒకప్పుడు నాదెండ్ల భాస్కర రావుకు అనుచరుడుగా ఉన్న జయప్రకాశ్... తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో ఆయనతో పాటే పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 1983లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి, తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు. 1994 నుంచి అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా, 1999 నుంచి 2004 వరకు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేశారు.

టిడిపి నుంచి నాదెండ్ల బయటకు వచ్చాక కొన్నాళ్లు తటస్థంగా ఉన్న జయప్రకాశ్ తిరిగి ఎన్నికల సమయంలో హరికృష్ణ ద్వారా టిడిపిలో చేరారు. అప్పట్లో టిడిపి, బిజెపిల పొత్తు నేపథ్యంలో తూర్పు నియోజకవర్గాన్ని బిజెపికి వదిలేయవలసి వచ్చింది. దీంతో పార్టీపై అలిగి జయప్రకాశ్ బయటకు వచ్చారు. తర్వాత కాంగ్రెస్ అభిమానిగా ఉన్నారు. కొంతకాలంగా లగడపాటి శిబిరంలో కీలక వ్యక్తిగా కొనసాగుతూ సమైక్యవాదిగా తన వాదనను వినిపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+