వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రన్నాయుడి కొడుకు ఉద్వేగ ప్రసంగం, శభాషన్న బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rammohan Naidu
విశాఖపట్నం: దివంగత తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజారపు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు విశాఖలో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా ఉద్వేగంగా ప్రసంగించారు. రామ్మోహన్ మాత్రం మైకు పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి పెద్దలందరినీ పేరుపేరున ప్రస్తావించి ప్రసంగం చేశారు. ఆరు పదుల వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేసి బాబు తెలుగు ప్రజల గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపారని, దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి ఉప్పెనలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల వరకు పనిచేసి టిడిపిని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును అధిష్ఠింపజేయాలని, ఢిల్లీలో తెలుగుదేశం చక్రం తిప్పాలని ఆకాంక్షించారు. తన తండ్రి ఆశయం కూడా అదేనని, దాన్ని నెరవేర్చే బాధ్యత శ్రీకాకుళం జిల్లా ప్రజలు తన భుజస్కంధాలపై మోపారన్నారు. అందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ప్రసంగం తర్వాత రామ్మోహన్‌ను పిలిచి శెభాష్ అంటూ బాబు భుజం తట్టారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పితృ ద్రోహిగా మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు అభివర్ణించారు. వేల కోట్ల రూపాయల దోపిడీని సిబిఐ బయటపెడుతున్నా జగన్ ఇంకా రాజకీయాలు చేయడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. జాతి సంపదను కాంగ్రెస్ నేతలు దోపిడీ చేస్తున్నారని, కాంగ్రెస్ దోపిడీ పార్టీకాగా జగన్ పార్టీ గజదొంగల పార్టీ అని మరో నేత అయ్యన్నపాత్రుడు అభివర్ణించారు.

English summary

 Telugudesam Party chief Nara Chandrababu Naidu congratulated Rammohan Naidu for his interesting speech.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X