బొగ్గు స్కాం: దాసరి నారాయణరావుని ప్రశ్నించిన సిబిఐ

2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి మాజీ మంత్రులను ప్రశ్నించినట్లు సిబిఐ తెలిపింది. దాసరిని హైదరాబాదులోనే సిబిఐ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దాసరితో పాటు మరో మాజీ మంత్రి సంతోష్ బగ్రోడియాను కూడా ప్రశ్నించినట్లు తెలిపింది.
ధర్మానపై పిసి యాక్టు తొలగిస్తాం: సిబిఐ కోర్టు
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మాన ప్రసాద రావు పైన పిసి యాక్టు తొలగిస్తామని సిబిఐ కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానిని తొలగిస్తామని చెప్పింది.
ప్రభుత్వం అనుమతి లేకుండానే ధర్మానను విచారించేందుకు కిందికోర్టు అనుమతించడంతో హైకోర్టు దానిని తోసిపుచ్చిన విషయం తెలిసిందే. హైకోర్టులో ధర్మానకు ఈ విషయంలో ఊరట లభించింది. దీంతో అతనిపై పిసి యాక్టు తొలగిస్తామని సిబిఐ కోర్టు తెలిపింది. కాగా, వ్యక్తిగత కారణాలతో తాను కోర్టుకు హాజరు కాలేకపోతున్నానని మంత్రి ధర్మాన ప్రసాద రావు కోర్టుకు తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications