మేం గేట్లు తీయలేదు: రఘుపై బాబు, కడియంపై ఫైర్

అవినీతి ఓ సమస్యే కాదన్నట్లుగా కాంగ్రెసు నేతలు మాట్లాడుతున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురించి కాంగ్రెసు నేతలు, కాంగ్రెసు అవినీతి గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాట్లాడదన్నారు. అవినీతి మంత్రులపై గవర్నర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.
సుప్రీం కోర్టు సిబిఐ చిలుక పలుకులను పిల్ల కాంగ్రెసు తమకు అనుకూలంగా మార్చుకుందన్నారు. బెయిల్ రాకపోతే తనపై ఆరోపణలు చేయడమేమిటన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల వ్యాఖ్యలు కోర్టు ధిక్కారణ కిందకే వస్తాయన్నారు. కోర్టులను నేను ప్రభావితం చేస్తాననడం సిగ్గుచేటు అన్నారు. అవినీతిపరులు అంతా ఒక్కటయ్యారని మండిపడ్డారు. ఓబుళాపురంపై పోరాడింది టిడిపియే అన్నారు.
జాతి సంపదను హవాలా ద్వారా విదేశాలకు పంపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతి వల్ల దేశ ఆర్థిక పరిస్థితే చిన్నాభిన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపికి వ్యక్తులు ముఖ్యం కాదని, సమాజం ముఖ్యమన్నారు. కొందరు నేనేదో హత్యలు చేయించినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు.
రఘునందన్ కలయికపై...
తెరాస బహిష్కృత నేత రఘునందన రావు తనను కలువలేదని చంద్రబాబు చెప్పారు. తాను వాళ్ల మాదిరిగా రహస్యంగా కలువవని, ఎవరితోనైనా బహిరంగంగానే సమావేశమవుతామన్నారు. తాము గేట్లు తీయలేదని, తలుపులు మాత్రమే తీశామన్నారు. తమ పార్టీ బలంగా ఉంది కాబట్టే తమను టార్గెట్ చేశారని అన్నారు.
పదవులు ఇచ్చినప్పుడు కడియం శ్రీహరికి ముప్పయ్యేళ్లు పరిశుద్దంగా కనిపించి ఇప్పుడు చెడ్డవాడినయ్యానా అని ప్రశ్నించారు. టిడిపిలోకి వచ్చేందుకు చాలామంది క్యూలో ఉన్నారని, త్వరలో వారి వివరాలు బయటకు వస్తాయన్నారు. తమపై విమర్శలు చేసే వారికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications