2వసారి: ముంబై జైళ్లో అబూ సలేంపై తోటిఖైదీ కాల్పులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో 1993లో జరిగిన బాంబు పేలుళ్ల కేసు నిందితుడు, గ్యాంగ్స్టర్ అబూ సలేం పైన తోటి ఖైదీ కాల్పులు జరిపాడు. అబూ సలేం ముంబైలోని తలోజా కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఓ న్యాయవాది హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవేంద్ర జగ్తప్.. అబూ సలేం పైన ఒక రౌండ్ కాల్చాడు.

దీంతో అబూ సలేం చేతికి తీవ్ర గాయమైంది. నిందితుడు ఓ రౌండ్ కాల్చడంతో సలేంకు గాయమైందని పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. జగ్తప్కు తుపాకీ ఎలా లభ్యమైందన్న విషయంపై విచారణ చేస్తున్నామన్నారు.
అబూ సలేం పైన ఇలా దాడి జరగడం రెండోసారి. పోర్చుగల్ నుంచి 2005లో భారత్ తీసుకొచ్చిన అనంతరం 2010లో ఆర్థర్రోడ్ జైలులో ఉన్నపుడు.. తోటి ఖైదీ చేతిలో అబూ సలేం దాడికి గురయ్యాడు. మళ్లీ ఇపుడు రెండోసారి తోటి ఖైదీ చేతిలో కాల్పులకు గాయపడ్డాడు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications