గండ్ర కోడ్ ఉల్లంఘన: జగన్ పార్టీకి పాస్టర్ మద్దతు, కేసు

చర్చి ప్రాంగణంలోనే చీఫ్ విప్తో పాటు పార్టీ నాయకులు కూర్చోవడానికి వీలుగా కుర్చీలు వేశారు. అదే వేదికగా గండ్ర ఇరవై నిమిషాల పాటు మాట్లాడారు. దళితుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ.. కాంగ్రెసు మద్దతుదారుకు ఓటేయాలని కోరారు. ప్రార్థనాలయాల్లో ప్రచారం నిర్వహించడం కోడ్ ఉల్లంఘన కిందకి వస్తుందని మండల ఎన్నికల అధికారి తహసీల్దారు తెలిపారు.
పాస్టర్ పైన కేసు
ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మాట్లాడిన ఓ పాస్టర్ పైన కేసు నమోదైంది. సదరు పాస్టర్ పంచాయతీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులకు ఓటేయాలని అడిగారు. ఈ విషయమై జయమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రార్థన సమయంలో ఓ వర్గానికి చెందిన దాదాపు వంద మంది ప్రజలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారుకు ఓటేయాలని అడిగారని ఆమె ఫిర్యాదు చేశారు. మతపరంగా ఓట్లు అడగటం సరికాదని ఆమె పేర్కొన్నారు. పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications