ఖైరతాబాద్ గణేషుడికి 4టన్నుల తాపేశ్వరం మహాలడ్డు

తాపేశ్వరంలో 100 మంది కార్మికులు 21 రోజుల పాటు నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో నాలుగు వేల కిలోల భారీ లడ్డును తయారు చేశారు. మొదటగా 200 కిలోల నుంచి ప్రారంభమైన లడ్డు అంచెలంచెలుగా పెరుగుతూ ఇప్పుడు 4 వేల కిలోలకు చేరింది.
కాగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు సోమవారం కొలువు దీరాడు. హైదరాబాదులోని ఖైరతాబాద్లో గోచతుర్ముఖ వినాయకుడు కొలువు దీరాడు. ఈ వినాయకుడికి గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం తొలి పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ శాలువా కప్పి ఆహ్వానం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని గవర్నర్ సత్కరించారు. ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది గోచతుర్ముఖ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఓ వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరో వైపు శక్తి మాత కొలువు దీరారు. భారీ రూపంలో దర్శనమిచ్చే గణనాథుడికి అంతే స్థాయిలో లడ్డూను తయారు చేశారు. నాలుగు వేల కేజీల లడ్డూను వినాయకుడి చేతిలో పెట్టారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications