ఢిల్లీ గ్యాంగ్ రేప్: దోషులుగా నిర్ధారించిన కోర్టు, రేపు శిక్ష

ఈ రోజు ఉదయం ఢిల్లీ పోలీసులు వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు. ఉదయం పదిన్నర గంటలకు తీర్పు వెలువడాల్సి ఉండగా, రెండు గంటలు ఆలస్యంగా పన్నెండున్నర గంటలకు వెలువడింది. ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన కోర్టు, రేపు శిక్ష పైన వారి వాదనలు విని, ఖరారు చేసే అవకాశముంది. శిక్ష పైన వాదనలు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కానున్నాయి. నిందితులపై అత్యాచారం, హత్య, అపహరణ, దోపిడీ తదితర పదమూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులు అరెస్టైన విషయం తెలిసిందే. అందులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఇటీవలే జైలులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ కావడంతో జువైనల్ కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. మిగిలిన నలుగురిని కోర్టు దోషులుగా ఈ రోజు తీర్పు చెప్పింది.
ఉరివేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్
నిర్భయ కుటుంబ సభ్యులు, పలు మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజు కోర్టుకు వచ్చాయి. దోషులను కఠినంగా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. దోషులను ఉరి వేయకుంటే నిర్భయ చట్టం రూపకల్పనకు అర్థమే ఉండదని మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు అన్నారు.












Click it and Unblock the Notifications