ఇంకా లభ్యం కాని 25 మంది అచూకి..ఉత్తరాఖండ్ బృందాలతో సహయక చర్యలు
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు ప్రమాదంలో సహయచర్యలకు చీకటి పడడంతో బ్రేక్ పడింది. రెండు హెలి కాప్టర్లతో పాటు ప్రత్యేక బృందాల ద్వార గాలింపు చర్యలు చేపట్టినప్పటికి రాత్రి ఎనిమిది గంటల వరకు 8 మృతదేహాలను మాత్రమే వెలికి తీయగల్గిగారు. మధ్యహ్నం గాలింపు చేపట్టిన ప్రయోజం లేకపోవడంతో ఉత్తరఖండ్ నుండి ప్రత్యేక బృందాలు సహయాక చర్యలు చేపట్టనున్నారు.

రేపు కూడ సహయక చర్యలు
కాగా ప్రమాదం జరిగిన సమయంలో లాంచీలో మొత్తం 71మంది ఉన్నట్లు సమాచారం. వారిలో 61మంది ప్రయాణికులు కాగా, 10మంది లాంచీ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మధ్యహ్నం నుండి సహయ చర్యలు చేపట్టిన అధికారులు 2 హెలికాప్టర్లు, 6 అగ్నిమాపక సిబ్బంది బృందాలతో పాటు నేవీ, గజ ఈతగాళ్ళతో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. సహయక చర్యలకు సంబంధించి ఏపీ మంత్రులు, అధికారులు సహయక చర్యలను పర్వవేక్షిస్తున్నారు. ఇక ప్రమాదానికి గురైనవారు ఎక్కువగా తెలంగాణకు చెందిన వారే ఉండడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ సంఘటన స్థలానికి హుటాహుటిన బయలు దేరారు.

71లో సురక్షితంగా బయటపడ్డ 27 మంది
కాగా రాత్రీ ఎనిమిది గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 71 మంది ప్రయాణికుల్లో 27 మంది సురక్షితంగా బయటపడ్డారిని అధికారిక సమాచారం అందించారు... కాగా ఎనిమిది మంది మృతదేహాలను కనుగొన్నట్టు తెలిపారు. ప్రమాదానికి గురైన వారిలో 25 మంది అచూకి తెలియాల్సిన అవసరం ఉంది. వీరి అచూకి కోసం ప్రస్తుతం చేపడుతున్న గాలింపు చర్యలకు బ్రేక్ పడింది. ప్రమాదం జరిగిన చోట వరద ఎక్కువగా ఉండడంతో భాదితుల ఆచూకి కనుగొనడం కోసం ఉత్తరాఖండ్ నుండి ప్రత్యేక టెక్నాలజీ గల బృందాలను రప్పించనున్నారు. వారి సహయంతో సోమవారం ఉదంయ గాలింపు చర్యలు చేపట్టనున్నారు.

లభ్యం కాని 25 మంది ఆచూకి
ప్రమాదానికి గురైన వారు మృతి చెందినట్టయితే అవి సముంద్రంలోకి కొట్టుకుపోకుండా రాజమండ్రి బ్రిడ్జి వద్ద వలలు ఏర్పాటు చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్ నుండి వచ్చే బృందాలు ఏవైన మృతదేహాలు బురదలో కూరుకు పోయినట్టయితే వాటిని కనుగునే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రమాద సంఘటనలో ఇంకా 25 మంది వరకు ఆచూకి లభించాల్సిన అవసరం ఉంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications