'30వ వరద వార్షికోత్సవం' నిరసన: చిరును అడ్డగించారు
రాజమండ్రి/విశాఖ: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రాజకీయ నాయకులు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ఈబిసి కాలనీవాసులు వినూత్న నిరసన తెలిపారు.
తమ కాలనీకి పరామర్శించేందుకు వచ్చే రాజకీయ నాయకుల కోసం వారు వినూత్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 30వ వరద వార్షికోత్సవం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం వరద బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులకు స్వాగతం అంటూ అందులో రాశారు.

గత ముప్పై ఏళ్లుగా తమ ప్రాంతం వరద నీటితో నిండిపోతోందని, ప్రతి ఏటా రాజకీయ నాయకులు వచ్చి తమను పరామర్శించి వెళ్లడమే తప్ప చేసిందేమీ లేదని అందుకే నిరసనగా ఇలా 30వ వరద వార్షికోత్సవం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.
చిరంజీవిని అడ్డుకున్న వరద బాధితులు
విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని వరద బాధితులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చిరును వరద సహాయచర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బాధితులు అడ్డుకున్నారు. ఆదివారం కేంద్రమంత్రి పళ్లం రాజును కూడా బాధితులు అడ్డుకున్నారు.
సిఎం సమక్షంలో పనబాకకు షాక్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన వెంట కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఉన్నారు. ఆమెకు సిఎం సమక్షంలోనే సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర ద్రోహి పనబాక గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications