Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'30వ వరద వార్షికోత్సవం' నిరసన: చిరును అడ్డగించారు

రాజమండ్రి/విశాఖ: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. రాజకీయ నాయకులు వరద బాధిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామంలో ఈబిసి కాలనీవాసులు వినూత్న నిరసన తెలిపారు.

తమ కాలనీకి పరామర్శించేందుకు వచ్చే రాజకీయ నాయకుల కోసం వారు వినూత్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 30వ వరద వార్షికోత్సవం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం వరద బాధితులను పరామర్శించేందుకు వస్తున్న ప్రజాప్రతినిధులకు స్వాగతం అంటూ అందులో రాశారు.

30th flood anniversery

గత ముప్పై ఏళ్లుగా తమ ప్రాంతం వరద నీటితో నిండిపోతోందని, ప్రతి ఏటా రాజకీయ నాయకులు వచ్చి తమను పరామర్శించి వెళ్లడమే తప్ప చేసిందేమీ లేదని అందుకే నిరసనగా ఇలా 30వ వరద వార్షికోత్సవం అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు బాధితులు చెబుతున్నారు.

చిరంజీవిని అడ్డుకున్న వరద బాధితులు

విశాఖ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిని వరద బాధితులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చిరును వరద సహాయచర్యలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ బాధితులు అడ్డుకున్నారు. ఆదివారం కేంద్రమంత్రి పళ్లం రాజును కూడా బాధితులు అడ్డుకున్నారు.

సిఎం సమక్షంలో పనబాకకు షాక్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకాశం జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన వెంట కేంద్రమంత్రి పనబాక లక్ష్మి ఉన్నారు. ఆమెకు సిఎం సమక్షంలోనే సమైక్య సెగ తగిలింది. సీమాంధ్ర ద్రోహి పనబాక గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+