కుక్కల దాడిలో నాలుగేళ్ళ ఇబ్రహీం మృతి
ర్నూల్: కర్నూల్ జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం సాయంత్రం కుక్కల దాడిలో నాలుగేళ్ళ ఇబ్రహీం మృత్యువాత పడ్డాడు. తాము పనిచేసే ప్రాంతానికి తల్లిదండ్రులు ఇబ్రహీం ను తీసుకెళ్ళారు. అయితే అక్కడ రెండు కుక్కలు దాడి చేయడంతో ఇబ్రహీం మృత్యువాత పడ్డాడు.
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామానికి చెందిన నాలుగేళ్ల ఇబ్రహీంను తీసుకొని తల్లి దండ్రులు హుస్సేన్ పీరా, చాంద్బీ దంపతులకు పంట నూర్పిడి పనులకు వెళ్ళారు. పంట నూర్పిడి పనుల్లో వారంతా నిమగ్నమయ్యారు.

అయితే పొలం దగ్గర ఊయలను ఏర్పాటు చేసి ఇబ్రహీంను అందులో పడుకోబెట్టారు. రెండు కుక్కలు వచ్చి ఇబ్రహీంను పీక్కుతిన్నాయి. పంట నూర్పిడి యంత్రం శబ్దానికి బాలుడి అరుపులు విన్పించలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.
తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళేసరికి ఇబ్రహీం ముఖాన్ని కుక్కలు చిధ్రం చేశాయి. బిడ్డ మరణించడంతో తల్లి చాంద్బీ సొమ్మసిల్లి పడిపోయింది. ఇంట్లో వదిలేసి వస్తే రక్షణ ఉండదని తమ వెంట తీసుకొచ్చి ఇబ్రహీంను చంపేసుకొన్నామని ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications