చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారా ?, టీటీడీ అధికారుల నిర్లక్షంతో సీఎం సీరియస్, కథ క్లోజ్ !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు మొదట తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తరువాత సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు తిరుపతిలోని టీడీపీ నాయకులను కలిశారు. తరువాత అక్కడి నుంచి తిరుమల చేరుకున్నారు.
సీఎం హోదాలో తిరుమల చేరుకున్న చంద్రబాబు అక్కడి గాయిత్రీ నిలయం దగ్గరకు వెళ్లారు. చంద్రబాబును టీడీపీ నాయకులు, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు దేవాదాయ శాఖ అధికారులు కారు దగ్గరకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డితో పాటు టీటీడీ అధికారులు ఎవ్వరూ గాయిత్రీ నిలయం దగ్గరకు వెళ్లిన చంద్రబాబుకు స్వాగతం పలకడానికి కారు దగ్గరకు వెళ్లలేదు.

కారు దిగిన చంద్రబాబు నేరుగా గాయిత్రీ నిలయం లోపలికి వెళ్లారు. గాయిత్రీ నిలయం విశ్రాంతి భవనం లోపల టీటీడీ జేఈవో, టీటీడీ ఇన్ చార్జ్ ఈవో వీరబ్రహ్మం సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే టీటీడీ అధికారుల తీరుతో అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు జేఈవో వీరబ్రహ్మం నుంచి బోకే తీసుకోవడానికి నిరాకరించి విశ్రాంతి భవనంలోపలికి వెళ్లిపోయారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత చంద్రబాబు మొదట తిరుమలకు వస్తారని ముందుగానే టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే టీటీడీ అధికారులు తీరును అందరూ ఖండిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని టీటీడీలోని ఉన్నతాధికారులు అనుకున్నారా ? అని అదే టీటీడీలోని కొందరు అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు., లేక ఇంతకాలం వైసీపీ సేవలో తరించిన అధికారులు ఆ మూడ్ నుంచి ఇంకా బయటకు రాలేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని విజయవాడ వెళ్లిన తరువాత టీటీడీలోని ఉన్నతాధికారుల కథ చూడాలని సీఎం చంద్రబాబు అనుకుంటున్నారని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు. తిరుమలలో సీఎం చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కారికాలవలన్, అనంతపురం రేంజ్ డీఐజీ శ్రీమతి సిమోషి, తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు, టీటీడీ జేఈవో శ్రీమతి గౌతమి కలిశారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications