ఆంధ్రాకు తప్పిన వాయుగుండం ముప్పు
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ను కలవరపెడుతున్న వాయుగుండం ముప్పు నుంచి ప్రజలు తప్పించుకున్నారు. వాయుగుండం ముప్పు తొలగిపోవడంతో అన్నదాతలు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
విశాఖపట్టణంకు ఈశాన్యంగా 160 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం బంగ్లాదేశ్ దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంగా కదులుతోంది. ఈ సమయంలో సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు.
ఆ సమయంలో సముద్రంలోకి వేటకు వెళ్లరాదని మత్స్యకారులను వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయితే శనివారం వేకువ జామున వాయుగుండం ముప్పు నుంచి ప్రజలు తప్పించుకున్నారు.
ఒడిశాలోని పరదీప్ మీదుగా వందల కిలోమీటర్ల వేగంతో బంగ్లాదేశ్ లోని కేపుపర వైపు వాయుగుండం వెళ్లిందని అధికారులు గుర్తించారు. విశాఖపట్టణం ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల ప్రజలు వాయుగండం ముప్పు నుంచి తప్పించుకున్నారు.