Weather Update: వేసవి వచ్చేసింది కానీ.. 3 రోజులు వర్షాలే
రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. క్యాలెండర్లో ఇంకా ఫిబ్రవరి నెల కూడా పూర్తికాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా మార్చి రెండో వారం నుంచి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రికార్డు స్థాయికి చేరుతున్నాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
ఎండలు మండుతుండగానే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణంలో అనిశ్చితిని సృష్టిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ఆదివారం నాటికి మరింత బలపడి 'తీవ్ర అల్పపీడనంగా' మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ప్రస్తుతం పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతున్నప్పటికీ, రాబోయే 48 గంటల్లో ఈశాన్యం వైపు మళ్లే (Recurve) అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Weather Update: రికార్డ్ స్థాయిలో ఉష్టోగ్రతలు
ముఖ్యంగా నందిగామ, కర్నూలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. తీర ప్రాంతాలైన విశాఖపట్నం, తుని, నరసాపురం, బాపట్లలో సైతం సాధారణం కంటే 2 నుండి 3.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది.
మూడు రోజుల పాటు వర్షాలు.. పిడుగుల హెచ్చరిక
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆది, సోమవారాల్లో తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
అటు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జల్లులు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర కోస్తాలో నైరుతి గాలులు, దక్షిణ కోస్తాలో ఆగ్నేయ గాలులు వీస్తుండటంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎండల నుంచి ఉపశమనం లభించినప్పటికీ, వర్షం కురిసే సమయంలో బయటకు రావద్దని అధికారులు ప్రజలను కోరుతున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications