ఏప్రిల్ 6వరకు అసెంబ్లీ సమావేశాలు పొడిగింపు...సెలవులు ఇవే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను మరి కొన్ని రోజుల పాటు పొడిగించారు. శాసనసభ సమావేశాలను వచ్చే నెల 6 వరకు పొడిగించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. తాజా నిర్ణయం మేరకు మార్చి 28, 29 తేదీల్లో...ఏప్రిల్ 2, 3, 4, 6 తేదీల్లో మరో ఆరు రోజులు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి.
అయితే మార్చి 30, 31, ఏప్రిల్ 1, 5 తేదీల్లో అసెంబ్లీకి సమావేశాలకు సెలవుగా ప్రకటించారు. అలాగే ఈనెల 28న శాసన సభలో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బిఏసీ సమావేశానికి టిడిపి నుంచి కెఈ కృష్ణమూర్తి, పల్లె రఘునాథరెడ్డి హాజరుకాగా, బిజెపి నుండి విష్టుకుమార్ రాజు హాజరయ్యారు.

మరోవైపు వచ్చే నెల 2,3 తేదీల్లో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహించాలని బిఎసిలో నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 4 వ తేదీ సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంతో పాటు విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications