స్మార్ట్గా మారండి: చంద్రబాబు పిలుపు(పిక్చర్స్)
విజయవాడ: సాంకేతిక సృజనాత్మకత, ఆవిష్కరణలతో విద్యార్థులు ముందంజలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి రాబోతోందని చెప్పారు. మన పిల్లల తెలివితేటలు అద్భుతమని, వాళ్లు ఎక్కడైనా రాణిస్తారని తెలిపారు. భవిష్యత్తు అంతా జ్ఞానంపైనే ఆధారపడి ఉండబోతోందని, దానిని అందరూ సాధించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 17 ఇంజనీరింగ్ కాలేజీల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం ఆ సెంటర్లను ఆన్లైన్లో ప్రారంభించారు. వాటితో పాటు యాప్ డెవలప్మెంట్ ప్రోగామ్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 17 ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
జ్ఞానానికి పెద్దపీట వేయాలనే రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించామని తెలిపారు. ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యాప్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తామని, స్టూడెంట్ డ్రివెన్(విద్యార్థులు కోరిన) విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఉన్న ప్రభు త్వ, ప్రైవేటు కళాశాలన్నింటిలో 1 గిగాబైట్ నుంచి 2 గిగా బైట్ల వరకు వైఫై సౌకర్యాన్ని తీసుకొస్తామని సిఎం చంద్రబాబు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
సాంకేతిక సృజనాత్మకత, ఆవిష్కరణలతో విద్యార్థులు ముందంజలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశానికి రాబోతోందని చెప్పారు. మన పిల్లల తెలివితేటలు అద్భుతమని, వాళ్లు ఎక్కడైనా రాణిస్తారని తెలిపారు.
చంద్రబాబు
భవిష్యత్తు అంతా జ్ఞానంపైనే ఆధారపడి ఉండబోతోందని, దానిని అందరూ సాధించాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా 17 ఇంజనీరింగ్ కాలేజీల్లో 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
చంద్రబాబు
విజయవాడలోని పిబి సిద్ధార్థ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఎం ఆ సెంటర్లను ఆన్లైన్లో ప్రారంభించారు. వాటితో పాటు యాప్ డెవలప్మెంట్ ప్రోగామ్స్ను ప్రారంభించారు.
చంద్రబాబు
ఈ సందర్భంగా 17 ఇంజనీరింగ్ కాలేజీల్లోని విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
చంద్రబాబు
ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వేలాది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
చంద్రబాబు
‘నా ఆశ.. ఆకాంక్ష మీరే(విద్యార్థులు). ప్రపంచంలోనే నాలెడ్జ్కు, విద్యకు ఆంధ్రప్రదేశ్ హబ్గా ఉండాలి. మీరు ఉద్యోగాల కోసం వెళ్లడం కాదు. మీరే ఉద్యోగాలు కల్పించే స్థితికి రావాలి' అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు
రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక ఐటీ నిపుణుడు తయారుకావాలి. లెర్న్(నేర్చుకోవడం), ఎర్న్(సంపాదించడం), ప్రోపగేషన్(వ్యాప్తిచేయడం, పెంపొందించడటం)ను ప్రతి ఒక్కరూ అవలంభించాలి' అని అన్నారు.
చంద్రబాబు
జ్ఞానానికి పెద్దపీట వేయాలనే రాష్ట్రవ్యాప్తంగా 17 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రారంభించామని తెలిపారు. ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.