సెక్యూరిటీ గార్డు కాల్పులు: ఉగండాలో ఆంధ్ర వ్యక్తి మృతి
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మండలం ఎ వేమరప్పాడుకు చెందిన సంజయ్ (47) అనే వ్యక్తి ఉగండాలో హత్య గురయ్యాడు. సంజయ్ 17 ఏళ్లుగా వ్యాపారం, ఉద్యోగం రీత్యా కుటుంబ సభ్యులతో కలిసి ఉగండాలోనే ఉంటున్నాడు.
ప్రస్తుతం గ్రోమోర్ సీడ్స్ కంపెనీ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీ రాత్రి కంపాల నగరంలో సంజయ్ని ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చి చంపాడు. సెక్యూరిటీ గార్డు డబ్బులు డిమాండ్ చేశాడని, ఇవ్వడానికి సంజయ్ నిరాకరించడంతో కాల్పులకు తెగబడ్డాడని సమాచారం.

శరీరంలోకి ఎనిమిది బుల్లెట్లు దూసుకుపోయి గాయపడిన సంజయ్ని ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసిన ఉగండా పోలీసులు పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని భారత్కు పంపించారు.
మృతదేహం ఆదివారం హైదరాబాద్కు చేరుకుంది. అక్కడి నుంచి ఎ వేమవరప్పాడు తరలించారు. సంజయ్కి భార్య సుహాసిని, కూతురు ఉదయ సాయి సాధన, కుమారుడు విష్ణురాజ్ ఉన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications