చంద్రబాబు స్ఫూర్తి: ముహూర్తం ఖరారు, సచివాలయంలో కొలువుదీరే తొలి శాఖలివే
అమరావతి: నవ్వాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక సచివాలయం ప్రారంభానికి ముహుర్తాన్ని ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. బుధవారం మధ్యాహ్నాం 2.59 గంటలకు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయాన్ని ప్రారంభించనున్నారు.
సచివాలయంలోని ఐదోవ బ్లాక్ కింది అంతస్తులో నాలుగు శాఖలను ప్రారంభించనున్నారు. కాగా, తాత్కాలిక సచివాలయానికి మొట్టమొదటగా తరలే శాఖల వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. వెలగపూడికి వెళ్లే శాఖలపై చీఫ్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ సోమవారం అధికారులతో సమీక్షించారు.
తొలిదశలో భాగంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రోడ్లు, భవనాలు, కార్మిక, ఉపాధి, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు తమ తమ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. తదుపరి భవనాలు అందుబాటులోకి వచ్చిన తరువాత మరిన్ని శాఖలు వస్తాయని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు హైదరాబాద్లోని ఉద్యోగులంతా జూన్ 27 (సోమవారం) నుంచి సొంత రాష్ట్రంలో విధులు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఏపీ తాత్కాలిక రాజధానిగా కొనసాగుతున్న విజయవాడ చుట్టుపక్కల 30కిపైగా కార్యాలయాలు కొలువుదీరాయి.
చాలా శాఖల కార్యాలయాలు సొంత భవనాల్లో, కొన్ని కార్యాలయాలు అద్దె భవనాల్లో మొదలవుతున్నాయి. హైదరాబాద్ నుంచి అమరావతికి గత వారం పది రోజులుగా తమ కార్యాలయాలను తరలించిన అధికారులు, సిబ్బందికి ఘనమైన స్వాగత ఏర్పాట్లు చేశారు.
సోమవారం కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ఏపీ ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి రావెల కిశోర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో అన్ని ప్రభుత్వశాఖలు తరలివస్తున్నాయని, ఇక నుంచి మరింత వేగవంతమైన పాలన జరుగుతుందని అన్నారు.
భవిష్యత్ తరాల కోసం ఉద్యోగులు త్యాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజధానికి తరలిరావాల్సిన చారిత్రక అవసరాన్ని ఉద్యోగులు గుర్తించారని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.1090 కోట్ల బడ్జెట్తో లక్షమంది యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. దళిత యువతికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ను అన్ని రకాలుగా బలోపేతం చేస్తామని జూపూడి స్పష్టం చేశారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications