దాడి: హర్షకుమార్ తనయుల అరెస్ట్, క్షమాపణ

సమాచారం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎంపి కుమారులు శ్రీరాజ్, సుందర్, అనుచరులు.. పోలీసులు ఉండగానే ఎన్జివో నేతలపై కర్రలతో దాడి చేసి దుర్భాషలాడారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎపిఎన్జీవో నేతలు భారీ సంఖ్యలో కళాశాల వద్ద చేరుకుని కళాశాల అద్దాలను, బస్సులను ధ్వంసం చేశారు. తమ నాయకులపై దాడి చేసిన ఎంపి తనయులను, అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమైక్య రాష్ట్రం కోసం 60రోజులుగా మేమంతా ఉద్యమం చేస్తుంటే తమపై దాడి చేయడం ఏంటని ఎపిఎన్జివో నేతలు మండిపడ్డారు. వారిపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు కళాశాల ఎదటు ఆందోళన నిర్వహించారు. కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకున్నారు. మొదట ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఎంపి హర్షకుమార్ తనయులిద్దర్నీ అరెస్ట్ చేశారు. చికిత్స నిమిత్తం గాయపడిన ఉద్యోగులను ఆస్పత్రికి తరలించారు.
కాగా ఘటనపై స్పందించిన ఎంపి హర్షకుమార్ ఎపి ఎన్జివో నేతలకు క్షమాపణలు చెప్పారు. తమ కుటుంబం మొత్తం సమైక్యవాదానికి కట్టుబడి ఉందని అన్నారు. మా కాలేజీని ఎప్పుడో మూసేశామని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదని హర్షకుమార్ అన్నారు. మమ్మల్ని టార్గెట్ చేయడం వెనక కొందరు సంఘ విద్రోహుల కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications