మల్కాజిగిరి: పవన్ కళ్యాణ్ టిడిపి వైపు తిప్పేశారా!?
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం మొదటి నుండి అందర్నీ బాగా ఆకర్షించుతోంది. జయప్రకాశ్ నారాయణ పైన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకోవడం తెలుగుదేశం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ నియోజకవర్గంలో మేథావులైన జెపి, నాగేశ్వర రావులతో మాజీ డిజిపి దినేష్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు. ఇక ఆయా ప్రధాన పార్టీల నుండి కీలక నేతలు బరిలో నిలిచారు.
మొత్తం 30 మంది బరిలో ఉన్నారు. టిడిపి నుండి సిహెచ్ మల్లారెడ్డి, కాంగ్రెస్ నుండి సర్వే సత్యనారాయణ, తెరాస నుండి మైనంపల్లి హన్మంత రావుయం పోటీ చేస్తున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఓటర్లు ఎవరి వైపుకు ఉన్నారనే విషయమై రోజుకో రకమైన వాదన వినిపిస్తోంది. జెపి గెలుపు ఖాయమని నిన్నటి వరకు అందరూ భావించారు. తెరాస, కాంగ్రెసు పార్టీలు కూడా గట్టి పోటీ ఇస్తాయని అభిప్రాయపడ్డారు.

తాజాగ తెరాస నేతల ఆస్తుల వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పరిస్థితులు తారుమారు అవుతున్నాయట. అలాగే పవన్ కళ్యాణ్ ప్రకటన జెపి పైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు. ఓటర్లు ఇప్పుడు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ చెబుతోంది. పోటీలో పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం టిడిపి అభ్యర్ధి మల్లారెడ్డి, జెపి, దినేష్ రెడ్డి, సర్వే, మైనంపల్లి మధ్యనే ఉండనుంది.
ఐదుగురిలో నలుగురు గతంలో వివిధ హోదాల్లో ఎమ్మెల్యేలుగానో, ఎంపిలుగానో పని చేసినవారే. దాంతో కొత్తగా బరిలోకి దిగిన వారి పట్లే ప్రజలు మొగ్గు చూపుతున్నారట. కొత్తగా పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్ధులు ఇద్దరు మాత్రమే ఉన్నారు.
వారిలో ఒకరు మల్లారెడ్డి కాగా, మరొకరు దినేష్ రెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి సిఎంఆర్ విద్యాసంస్థలను నిర్వహిస్తుండగా, దినేష్ రెడ్డి డిజిపిగా పని చేశారు. ఇరువురి పని తీరును గమనిస్తూ.. అంతిమంగా మల్లారెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారట. జెపికి మల్కాజిగిరిలో ప్రచారం చేస్తారనుకున్న పవన్... ఇటీవల పొత్తు ధర్మంలో భాగంగా తన మద్దతు మల్లారెడ్డికే అని చెప్పడం కూడా కలిసి వచ్చిందంటున్నారు. అయితే, తమదే గెలుపని, సినిమా వాళ్లు చెప్పినంత మాత్రాన ఇప్పుడు ఓటర్లు వినే పరిస్థితి లేదని విపక్షాలు అంటున్నాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications