సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు తరపున ప్రతినిధులుగా ఆ ఇద్దరు
ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు. అయితే ఏపీ సీఎం గా జగన్ ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నా టీడీపీ ప్రతినిధి బృందం హాజరుకానుంది.ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.జగన్కు శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ బృందం లేఖను కూడ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణం చేయనున్న సందర్భంగా హాజరు కావాలా వద్దా అన్న అంశంపై టీడీపీ శాసనసభపక్ష సమావేశంలో చర్చ జరిగింది.ఈ సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని నిర్ణయం తీసుకొన్నారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే చంద్రబాబు తరపున ప్రతినిధులుగా టీడీపీ సీనియర్ నాయకులు ఎనమల రామకృష్ణుడు , అచ్చెన్నాయుడు హాజరు అవుతారని తెలుస్తుంది.

గతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గానీ, అమరావతి శంకుస్థాపనకు కానీ జగన్ రాలేదు .2014లో తాను సీఎంగా చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించగా జగన్ అందుబాటులో లేరు . జగన్ హాజరుకాలేకపోయినా కనీసం వైసీపీ ప్రతినిధి బృందాన్ని సైతం పంపలేదు. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కూడా హాజరు కావాలని మంత్రుల బృందం వైయస్ జగన్ నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్ళింది . మంత్రుల బృందాన్ని కలిసేందుకు జగన్ నిరాకరించారు. గత పరిణామాలను గుర్తుకు తెచ్చిన టీడీపీ శ్రేణులు జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు దూరంగా వుండాలని, టీడీపీ తరపున ఎనమల రామకృష్ణుడు , అచ్చెన్నాయుడు వెళ్ళాలని నిర్ణయించారు .
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications