గోదావరిలో పడవ బోల్తా: ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

 Boat over turns in Godavari river, two killed
రాజమండ్రి/ కర్నూలు: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద పడ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. అతని ఆచూకీ తెలియడం లేదు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో జరిగింది.

ఓ పెళ్లి బృందానికి చెందిన ఏడుగురు ఓ పడవలో పడ్డారు. ఈదురుగాలులతో, భారీ వర్షం రావడంతో పాటు వరద నీరు కూడా వచ్చి చేరడంతో పడవ అటూ ఇటూ కొట్టుకుని బోల్తా పడింది. పడవలోని నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.

కర్నూలు జిల్లాలోని గోకులపాడులో కురిసిన వర్షాలు ఓ కుటుంబాన్ని నిలువునా మింగేశాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు వెళుతున్న అక్కా, చెల్లెలు, తండ్రి ఈ ముగ్గురు ఉధృతంగా ప్రవహిస్తున్న ముక్కేరువాగులో కొట్టుకుపోయారు.

సుశీల, శశికళ వారి తండ్రి నారాయణ వాగు దాటేందుకు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. నారాయణ మృతదేహం లభ్యం కాగా, అక్కా చెల్లెళ్ల మృత దేహాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+